అక్షరటుడే, ఆర్మూర్: RTC Strike | కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు (మంగళవారం) అర్ధరాత్రి నుంచి ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. దీంతో నిజామాబాద్ జిల్లా రీజినల్ పరిధిలోని ఆరు డిపోల (నిజామాబాద్ -1, నిజామాబాద్ -2, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ) బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి.
RTC Strike | ప్రభుత్వం వెనుకడుగు…
Tg RTC ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో చాలా అంశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయడం, యూనియన్ల పునరుద్ధరణకు ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది. కానీ తమ డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని ఆర్టీసీ జేఏసీ నేతలు దృఢ సంకల్పంతో ఉన్నారు.
RTC Strike | ప్రయాణికుల్లో ఆందోళన..
అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్ కానుండటంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. నిజామాబాద్ రీజినల్ లోని ఆరు డిపోల పరిధిలో 700 బస్సులు నిత్యం 3,200 ట్రిప్పులు తిరుగుతాయి.
ఈ లెక్కన సుమారు రోజుకు రూ. 68 – 75 లక్షల వరకు నష్టం కలగనుంది. ఆర్టీసీ సమ్మెతో మరోవైపు పార్సిల్స్, కొరియర్ సర్వీసులు కూడా నిలిచిపోనున్నాయి.
RTC Strike | ప్రభుత్వం సానుకూలంగా ఉంది..

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. అన్ని అంశాలపై చర్చించేందుకు అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ఉద్యోగులు బాధ్యతగా ఉండాలని సూచించారు.
సమ్మెకు సంపూర్ణ మద్దతు..

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Telangana | చర్చలు విఫలం.. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్!

