నిజామాబాద్MP Arvind Comments | మోదీకి, రేవంత్​కు లింక్​ ఉందేమో.. ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

MP Arvind Comments | మోదీకి, రేవంత్​కు లింక్​ ఉందేమో.. ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని మోదీకి, సీఎం రేవంత్​రెడ్డి లింక్​లు ఉన్నాయేమోనని ఎంపీ అర్వింద్​ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: MP Arvind Comments | సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి ప్రధాని మోదీకి ఏమైనా లింకులు ఉన్నాయేమో అని ఎంపీ అర్వింద్​ అన్నారు. నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బెంగాల్​లో సువేంద్​ అధికారిలా మోదీ, రేవంత్​ కలుస్తారేమోనని అర్వింద్ అన్నారు. అందుకే నాతో కలిసి పని చేయి అన్నారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. కాగా బెంగాల్​లో సువేంద్​ అధికారి తృణమూల్​ నుంచి బీజేపీలో చేరారు. ఇటీవల హైదరాబాద్​లో జరిగిన కార్యక్రమంలో తనతో కలిసి పని చేయాలని రేవంత్​రెడ్డిని మోదీ కోరారు. ఈ క్రమంలో  ఎంపీ అర్వింద్​ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

MP Arvind Comments | వాళ్లను సీఎం చేయాలి

ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన పీఎం మాట్లాడుతూ.. సీఎం రేవంత్​రెడ్డిని బీజేపీలోకి రావాలని ఆహ్వానించిన సందర్భంగా ఎంపీ పై వ్యాఖ్యలు చేశారు. 2039 వరకు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రధాని కారని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని.. అంటే రాహుల్ ఇక ప్రధాని కాలేరని.. ఇంకో పదేళ్లు దేశంలో బీజేపీ ఉంటుందని సీఎం రేవంత్​రెడ్డే ఒప్పుకున్నారన్నారు. రేవంత్ రెడ్డికి బదులు కోమటి రెడ్డి, శ్రీధర్​బాబు లాంటి వాళ్లను సీఎం చేయాలని కాంగ్రెస్​కు సూచించారు. వారైతే మొదటి నుంచి కాంగ్రెస్​లో ఉన్నారని చెప్పారు.

MP Arvind Comments | సీఎం నిజామాబాద్​కు పంగనామాలు పెట్టిండు..

సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా (Nizamabad District)కు పంగనామాలు పెట్టాడాని ఎంపీ విమర్శించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్​ను రాజకీయంగా అణగదొక్కేందుకు సీఎం జిల్లాకు మొండిచేయి చూపుతున్నారని వ్యాఖ్యానించారు. ఇంకా ఏం ముఖం పెట్టుకొని మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలో తిరుగుతున్నారో అర్థం కావట్లేదని అన్నారు. నిజామాబాద్​కు అవుటర్ రింగ్ రోడ్డు ఇస్తా అని హామీ ఇచ్చిన సీఎం తర్వాత మరిచిపోయారన్నారు. ఇందూరు ప్రజలను మోసం చేస్తే భవిష్యత్తులో వారు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. దేవుళ్లను మోసం చేసిన వాడికి ప్రజలు ప్రజలను మోసం చేయడం పెద్ద లెక్క కాదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు పూర్తికావని జోస్యం చెప్పారు. ఇప్పటివరకు 25 శాతం పనులు కూడా పూర్తికాలేదని.. రూ.162 కోట్లకు గాను కేవలం రూ.10 కోట్ల నిధులు మాత్రమే యూజీడీకి ప్రభుత్వం కేటాయించిందన్నారు.

ఇది కూడా చదవండి..: Leopard Attack in Yellareddy | తాడ్వాయిలో చిరుత కలకలం.. లేగ దూడలపై దాడి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hyderabad Water Supply | హైదరాబాద్ వాసులకు అలెర్ట్​.. నీటి సరఫరాలో అంతరాయం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Water Supply | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు...

Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ముందుకు సాగాలి..

అక్షరటుడే, ఆర్మూర్: Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని...

Tourist Guide Recruitment | టూరిస్ట్ గైడ్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tourist Guide Recruitment | టూరిస్ట్​ గైడ్​ల...

Assistant Professor Merit List | మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Assistant Professor Merit List | ప్రభుత్వ మెడికల్...