అక్షరటుడే, తెయూ క్యాంపస్: Fee Reimbursement | తెలంగాణ యూనివర్సిటీలోని (Telangana University) ఆర్ట్స్ కళాశాల(Arts College) ఛాంబర్ను ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులైన విద్యార్థుల నుంచి ఫీజులు కట్టించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Fee Reimbursement | జీవోను పక్కనపెట్టి..
ఏబీవీపీ (ABVP) ఇందూర్ జిల్లా కన్వీనర్ అక్షయ్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులైన విద్యార్థుల నుండి అడ్మిషన్ రోజే కోర్సు ఫీజులు కట్టించుకోవడం సిగ్గుచేటన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేశాక విద్యార్థుల నుండి వారం రోజుల్లో ఫీజులు తీసుకోవాలని జీవోలో స్పష్టంగా ఉన్నప్పటికీ ఈ విషయాన్ని తుంగలో తొక్కి విచ్చలవిడిగా విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. అలాట్మెంట్ ఆర్డర్లలో ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఎలాంటి రుసుము లేకున్నప్పటికీ, రూల్స్కు విరుద్ధంగా అధికారుల వ్యవహరిస్తున్న తీరు బాధాకరమన్నారు.
ఇకనైనా అధికారులు జీవో, అలాట్మెంట్ ఆర్డర్లలో పొందపరిచిన రూల్స్ను పరిగణనలోకి తీసుకొని విద్యార్థుల నుండి ఒక్క రూపాయి కూడా వసూలు చేయవద్దని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి ఏబీవీపీ వెనకాడబోదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ సెక్రెటరీ సమీర్, ప్రాంత వనవాసి కన్వీనర్ అశోక్, శివ, మనోజ్, భార్గవ్, దుర్గ దాస్, విజయ్, విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.
