Varahi Navaratri Festival | కనుల పండువగా వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు

నిజామాబాద్​ నగరంలోని అమ్మవెంచర్​లో నూతనంగా నిర్మించిన వారాహి మాత అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Varahi Navaratri Festival | నగరంలోని (Nizamabad) అమ్మవెంచర్​లో నూతనంగా నిర్మించిన వారాహి మాత (Varahi Mata Temple) ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ మేరకు భక్తులు అధికసంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.

Varahi Navaratri Festival | ప్రత్యేక పూజలు

ఈనెల 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు వారాహి మాత అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్​ మంచాల జ్ఞానేందర్​ పేర్కొన్నారు. నవరాత్రులు అమ్మవారికి విశేషపూజలు నిర్వహించామన్నారు. చివరిరోజు గురువారం ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, మహాయజ్ఞం, పల్లకీ సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు జరిపామని పేర్కొన్నారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారని వివరించారు. భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ నిర్వహించినట్లు మంచాల జ్ఞానేందర్​ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: మేడ్చల్‌లోని టెక్ మహీంద్రా కంపెనీ ముందు ఉద్యోగిని ధర్నా.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *