అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Illegal Tree Cutting | జిల్లాలోని (Nizamabad) నవీపేట్ (navipet) మండలం లింగాపూర్ గ్రామంలో అనుమతి లేకుండా చెట్లను నరికివేసిన ఘటనపై అటవీ శాఖ అధికారులు (Nizamabad Forest Department) చర్యలు చేపట్టారు. ఈ మేరకు వారిపై కేసులు నమోదు చేశారు.
Illegal Tree Cutting | అనుమతి లేకుండా 15 చెట్లు..
అటవీశాఖాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగాపూర్ గ్రామంలో ఈనెల 15న నిర్వహించిన తనిఖీలలో, సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతి పొందకుండా 15 చెట్లను నరికివేసినట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి తెలంగాణ వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ (WALTA) చట్టం, 2002, తెలంగాణ వాల్టా నిబంధనలు, 2004లోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో లింగాపూర్నకు చెందిన దొడ్డల బాలరాజ్ను నిందితుడిగా గుర్తించారు. అనుమతి లేకుండా చెట్లను నరికివేసినందుకు ఆయనపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. తనిఖీ సందర్భంగా నరికివేసిన 15 చెట్లను పరిశీలించి, వాటి కలప పరిమాణం, విలువను అంచనా వేయగా, కలప విలువ సుమారు రూ.4,692/-గా నమోదు చేశారు. శాఖ రికార్డుల ప్రకారం నిందితుడి నుండి రూ.9,384/- పరిహారాన్ని ఫీజుగా వసూలు చేశారు. అనంతరం నరికేసిన చెట్లను స్వాధీనం చేసుకున్నారు. యాంచ బీట్ ఫారెస్ట్ ఆఫీసర్ సుధీర్ కుమార్, నవీపేట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మహేంద్ర కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగింది.
ఇది కూడా చదవండి: Indian Stock Market | ఫ్లాట్గా ముగిసిన సూచీలు