అక్షరటుడే, ఇందూరు: Yoga For Health | యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని (Yoga) నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (Nizamabad Security Council) నిజామాబాద్ ప్రీపియర్ లీగ్ (ఎన్ఎస్సీఎన్పీఎల్) సహాయక కార్యదర్శి, కాకతీయ విద్యాసంస్థల (Kakatiya Educational Institutions) డైరెక్టర్ రజనీకాంత్ అన్నారు. ఎన్ఎస్సీఎన్పీఎల్ (NSCNPL) ఆధ్వర్యంలో ఏప్రిల్ 25వ తేదీ నుంచి 28 వరకు సుభాష్నగర్లోని కాకతీయ ఒలింపియాడ్లో జిల్లాస్థాయి యోగాసన పోటీలు నిర్వహించారు. అరంతరం ఆదివారం ఆరోగ్య రక్ష యోగా నేచర్ కేర్ సెంటర్లో బహుమతి ప్రధాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
Yoga For Health | యోగాతో చదువుపై ఏకాగ్రత..
ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. యోగాతో చదువుపై ఏకాగ్రత పెరుగుతుందన్నారు. విద్యార్థులు చదువులో చురుకుగా ఉండేందుకు తప్పకుండా యోగా చేయాలని సూచించారు. ఎన్ఎస్సీఎన్పీఎల్ మరో సహాయక కార్యదర్శి హితిన్ బీమాని మాట్లాడుతూ.. కౌన్సిల్ ఆధ్వర్యంలో పోటీలను (Nizamabad Yoga) నిర్వహించడం అభినందనీయమన్నారు. పోటీలను మూడు కేటగిరీల్లో నిర్వహించగా సుమారు 250మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఐఎస్వో పవన్కుమార్, ఆరోగ్య రక్ష నిర్వాహకురాలు డాక్టర్ ఐశ్వర్య కాలే, యోగా అసోసియేషన్ కార్యదర్శి గంగాధర్, గురువులు కమల వాణి, గాయత్రి, లోహిదాస్, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేశారు. పోటీలలో గెలుపొందిన వారికి నగదును బహుకరించారు. అనంతరం యోగా పోటీల నిర్వహణకు కృషి చేసిన నాగచైతన్యను ప్రత్యేకంగా అభినందించారు.
ఇది కూడా చదవండి: Yadadri Power Plant Fire|యాదాద్రి పవర్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెద్ద ముప్పు


