Varanasi Incident | కాశీలో గంగాస్నానం చేస్తూ బీరు​ తాగిన వ్యక్తి.. కేసు నమోదు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Varanasi Incident | భక్తులు ఎంతో పవిత్రంగా భావించే కాశీ (Kashi)లో ఓ వ్యక్తి గంగాస్నానం చేస్తూ బీరు​ తాగాడు. ఈ వీడియో సోషల్​ మీడియా (Social Media)లో వైరల్ కాగా.. భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్​ చేశారు.

వైరల్ అయిన వీడియోలో ఆ వ్యక్తి నదిలో స్నానం చేస్తూ బీరు తాగుతున్నట్లు కనిపిస్తోంది. నిందితుడిని బీహార్‌లోని రోహ్‌తాస్ జిల్లా నివాసిగా గుర్తించామని అధికారులు తెలిపారు. ఏసీపీ దశాశ్వమేధ అతుల్ అంజన్ త్రిపాఠి మాట్లాడుతూ, వైరల్ అయిన వీడియోను పోలీసులు సుమోటోగా స్వీకరించి, అందులో ఉన్న వ్యక్తిని గుర్తించారని చెప్పారు.

Varanasi Incident | నిందితుడి అరెస్ట్

బీహార్‌ (Bihar)లోని రోహ్‌తాస్​కు చెందిన నిందితుడిని పట్టుకోవడానిక వారణాసి పోలీసులు వెళ్లారు. అక్కడ నిందితుడిని అరెస్ట్ చేసి తీసుకు వస్తున్నారు. ఆ ప్రాంతంలో పోలీసులు క్రమం తప్పకుండా గస్తీ నిర్వహిస్తారని, భక్తులు, సందర్శకులు మత మనోభావాలను దెబ్బతీసే లేదా చట్టాన్ని ఉల్లంఘించే చర్యలకు పాల్పడవద్దని ఏసీపీ విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి..: Petrol Diesel Price Hike | ముచ్చటగా మూడోసారి వడ్డన.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *