తెలంగాణAnanya Infra Land Dispute | "రూ.200 కోట్ల భూమిని రూ.10 కోట్లకే రాసివ్వాలని కాంగ్రెస్...

Ananya Infra Land Dispute | “రూ.200 కోట్ల భూమిని రూ.10 కోట్లకే రాసివ్వాలని కాంగ్రెస్ ఎంపీ బెదిరింపులు”.. ‘అనన్య ఇన్ఫ్రా’ సంచలన ఆరోపణలు

గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్, ఇప్పుడు తమ సొంత ప్రజాప్రతినిధులపై వస్తున్న ఆరోపణలపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Ananya Infra Land Dispute | తెలంగాణలో అధికార మార్పిడి జరిగినా ‘భూ దందాలు, సెటిల్మెంట్ల’ పర్వం మాత్రం మారలేదనే విమర్శలకు బలం చేకూరుస్తూ ఒక సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

రూ.200 కోట్ల విలువైన తమ భూమిని కేవలం రూ.10 కోట్లకే సెటిల్ చేసుకోవాలంటూ అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎంపీ తమను తీవ్రంగా బెదిరిస్తున్నారని ‘అనన్య ఇన్ఫ్రా’ సంస్థ యజమానులు బహిరంగంగా ఆరోపించారు. బాధితులు మీడియా ఎదుట వెల్లడించిన ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Ananya Infra Land Dispute | ‘తెలంగాణ రైసింగ్’ అంటే ఇదేనా?

రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు “తెలంగాణ రైసింగ్” (Telangana Rising) అంటూ పెట్టుబడులను ఆకర్షించేందుకు, రాష్ట్ర ప్రగతిని చాటేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.

అయితే, క్షేత్రస్థాయిలో వ్యాపారవేత్తలు, భూ యజమానులపై అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నుంచే ఇలాంటి ఒత్తిళ్లు వస్తుంటే రాష్ట్రం ఎలా ‘రైస్’ అవుతుందని బాధితులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

“రూ.200 కోట్ల విలువైన మా భూమిని రూ.10 కోట్లకు సెటిల్ చేసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ బెదిరిస్తున్నాడు. ఇలాంటి అక్రమాలు, కబ్జాలు జరిగితే తెలంగాణ ఎలా రైసింగ్ అవుతుంది?” అని అనన్య ఇన్ఫ్రా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

Ananya Infra Land Dispute | కేసులు, అరెస్టుల పేరిట బెదిరింపులు..

సెటిల్మెంట్లు, ఒప్పందాలకు ఒప్పుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సదరు ఎంపీ హెచ్చరిస్తున్నట్లు బాధితులు పేర్కొన్నారు. తమ మాట వినకపోతే బాధితులపై, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరిస్తున్నట్లు సమాచారం.

గతంలోనూ ఇదే భూ వివాదంలో విచారణ పేరుతో తమను నాలుగు నెలల పాటు తీవ్రంగా హింసించారని, ఇప్పుడు మళ్లీ అదే తరహాలో అరెస్టులు చేస్తామంటూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారని వారు వాపోయారు.

Ananya Infra Land Dispute | రాజకీయ దుమారం: సవాల్‌గా మారిన శాంతిభద్రతలు

అధికార పార్టీకి చెందిన ఒక పార్లమెంట్ సభ్యుడి (MP) పైనే నేరుగా ఇలాంటి ఆరోపణలు రావడం కాంగ్రెస్ ప్రభుత్వానికి మింగుడుపడని అంశంగా మారింది.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్, ఇప్పుడు తమ సొంత ప్రజాప్రతినిధులపై వస్తున్న ఆరోపణలపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

పెట్టుబడులకు స్వర్గధామంగా నిలవాల్సిన హైదరాబాద్‌ పరిసరాల్లో.. ఇలాంటి బెదిరింపులు, పోలీసుల పేరిట వేధింపుల ఆరోపణలు రావడం వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరి ఈ రూ.200 కోట్ల భూవివాదంపై మరియు కాంగ్రెస్ ఎంపీ బెదిరింపులపై ప్రభుత్వం ఎలాంటి విచారణ జరుపుతుందో వేచి చూడాలి.

Jukkal MLA Comments | పోలీస్ vs ప్రజాప్రతినిధులు! అధికార పక్షంలో…

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Trump Modi friendship | మోడీ అంటే నాకు చాలా ఇష్టం.. ఐ లవ్ ఇండియా : డోనాల్డ్​ ట్రంప్

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump Modi friendship | అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ...

RTC Bus CC Camera | ఆర్టీసీ బస్సుల్లో ‘భరోసా’ పేరిట సీసీ కెమెరాల ఏర్పాటు

RTC Bus CC Camera | ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా తెలంగాణ...

Telangana Mahila Bhavanalu | అతివల సాధికారతకు రేవంత్ సర్కార్ చారిత్రాత్మక అడుగు.. రేపు 8 వేల మహిళా భవనాలకు శంకుస్థాపన!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Mahila Bhavanalu | తెలంగాణ రాష్ట్రంలో మహిళా...