అక్షరటుడే, డిచ్పల్లి: Bhupathi Reddy Warning | నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నల్లమట్టి తవ్వకాల పేరిట చెరువు శిఖం భూములను కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Bhupathi Reddy Warning | నల్లమట్టి పేరుతో..
నల్లమట్టి తరలింపు పేరుతో కొంతమంది దానిని దుర్వినియోగం చేస్తున్నారని ఎమ్మెల్యే (MLA Bhupathi Reddy) అన్నారు. చెరువు శిఖం భూములను కబ్జా చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వారిపై రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ తదితర శాఖల నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేయబడతాయన్నారు. ఎవరు కూడా చట్టాన్ని ఉల్లంఘించి పనులు చేయవద్దన్నారు. ఈ మేరకు సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్, పోలీసు, శాఖల అధికారులకు నిరంతర పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు.

ఇది కూడా చదవండి..: Mahesh Kumar Goud | తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయింది..: టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్


