అక్షరటుడే, వెబ్డెస్క్: Highway Privatization India | కేంద్ర ప్రభుత్వం (Central Government) పలు జాతీయ రహదారుల నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా తెలంగాణలోని యాదాద్రి–వరంగల్ హైవే ప్రైవేటుకు అప్పగించనున్నట్లు సమాచారం.
దేశంలోని 17 జాతీయ రహదారులను 2026–27 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటుకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలో NH–163 పరిధిలోని యాదాద్రి–వరంగల్ సెక్షన్లోని 99.1 కిలోమీటర్ల రహదారిని, కోమళ్ల, కోమటిపల్లి టోల్ ప్లాజాలను ప్రైవేటు సంస్థకు అప్పగించనుంది. హరియాణ, జార్ఖండ్ రాష్ట్రాల నుండి 3, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు నుండి 2, కర్ణాటక, బీహార్ రాష్ట్రాల నుండి ఒక్కో హైవేను ప్రవేటుకు అప్పగించేందుకు యత్నిస్తున్నట్లు సమచారం.
Highway Privatization India | ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో..
ప్రస్తుతం జాతీయ రహదారి నిర్వహణ బాధ్యతను ఎన్హెచ్ఏఐ చూసుకుంటుంది. టోల్ వసూల్ (Toll Collection)తో పాటు రోడ్లకు మరమ్మతులు, నిర్వహణ పనులు చేపడుతోంది. అయితే ఇక నుంచి కొన్ని హైవేల బాధ్యతలను ప్రైవేట్ సంస్థలు చూసుకోనున్నాయి. ప్రస్తుతం వాడుకలో ఉన్న జాతీయ రహదారి ఆస్తుల నుండి విలువను రాబట్టేందుకు, 2026-27 ఆర్థిక సంవత్సరంలో టోల్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (TOT), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (InvIT) పద్ధతుల కింద నగదీకరణ కోసం ప్రతిపాదించిన జాతీయ రహదారి (National Highway) మార్గాల తాత్కాలిక జాబితాను NHAI ఖరారు చేసింది.
Highway Privatization India | అభివృద్ధి కోసం
మరింత మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మూలధనాన్ని సమీకరించడానికి, ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, మరియు జాతీయ రహదారి నెట్వర్క్ యొక్క విస్తరణతో పాటు ఆధునీకరణను వేగవంతం చేయడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గుర్తించబడిన జాతీయ రహదారుల ఆస్తులు, మొత్తం 1692.5 కిలోమీటర్ల పొడవుతో, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, బీహార్, మహారాష్ట్రలతో సహా తొమ్మిది రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. ఈ రహదారి ఆస్తులు సమిష్టిగా, స్థిరమైన ట్రాఫిక్ సామర్థ్యం మరియు పటిష్టమైన కనెక్టివిటీ ప్రాముఖ్యత కలిగిన ఆర్థిక మరియు లాజిస్టిక్స్ కారిడార్లను సూచిస్తాయి.
ఇది కూడా చదవండి..: Mukesh Ambani Salary | ఆరేళ్లుగా వేతనమే లేదు.. అయినా ప్రపంచ కుబేరుల్లో 21వ స్థానం..


