జాతీయంTourist Taxi Accident | లోయలో పడిన ట్యాక్సీ.. ఇద్దరు చిన్నారులు సహా 8 మంది...

Tourist Taxi Accident | లోయలో పడిన ట్యాక్సీ.. ఇద్దరు చిన్నారులు సహా 8 మంది గల్లంతు

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో విషాదకర ప్రమాదం చోటుచేసుకుంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tourist Taxi Accident | హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులను తీసుకెళ్తున్న ఓ ట్యాక్సీ అదుపుతప్పి లోతైన లోయలో పడిపోవడంతో ఎనిమిది మంది గల్లంతైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. గల్లంతైన వారిలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

బాధితులు బెంగళూరు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రెండు కుటుంబాలకు చెందినవారని గుర్తించారు.ఈ విషాద ఘటన చంబా జిల్లాలోని బైరాగఢ్-సచ్ పాస్ రహదారిపై కాలాబన్ సమీపంలో చోటుచేసుకుంది. వేసవి సెలవులను ఆస్వాదించేందుకు బెంగళూరుకు చెందిన ఒక కుటుంబం, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మరో కుటుంబం హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం దల్హౌసీకి వెళ్లారు. అక్కడ నుంచి మంచుతో కప్పబడిన పర్వత ప్రాంతాలను సందర్శించేందుకు స్థానికంగా ఒక ట్యాక్సీని అద్దెకు తీసుకుని శుక్రవారం సచ్ పాస్ మార్గంలో ప్రయాణం ప్రారంభించారు.

Tourist Taxi Accident | లోతైన లోయ‌లో ప‌డిన ట్యాక్సీ..

Tourist Taxi Accident

అయితే నిర్ణయించిన సమయానికి వారు తిరిగి రాకపోవడంతో ట్యాక్సీ యజమానికి అనుమానం కలిగింది. వెంటనే వాహనానికి అమర్చిన జీపీఎస్ వ్యవస్థ ద్వారా లొకేషన్‌ను పరిశీలించాడు. కాలాబన్ సమీపంలో వాహనం చాలా సేపటి నుంచి కదలకుండా ఒకే చోట ఉన్నట్లు గుర్తించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.పోలీసులు, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా ట్యాక్సీ లోతైన లోయలో పడిపోయినట్లు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం అత్యంత ప్రమాదకరమైన కొండ ప్రాంతం కావడంతో సహాయక చర్యలు సవాలుగా మారాయి. అంతేకాకుండా అక్కడ మొబైల్ నెట్‌వర్క్ సదుపాయం లేకపోవడం, రహదారులు కూడా క్లిష్టంగా ఉండటంతో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.

Tourist Taxi Accident | తీవ్ర దిగ్భ్రాంతి..

Tourist Taxi Accident

సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పరిపాలన యంత్రాంగం, పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలను కూడా రంగంలోకి దింపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రమాదం గురించి తెలిసి బాధ కలిగిందని పేర్కొన్న ఆయన, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం సహాయక సిబ్బంది లోయ ప్రాంతంలో విస్తృతంగా గాలిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతం క్లిష్ట భౌగోళిక పరిస్థితులు కలిగి ఉండటంతో ఆపరేషన్‌కు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గల్లంతైన వారి ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇది కూడా చదవండి..: June Bank Holidays | బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్ లో ఏయే రోజుల్లో బంద్ ఉంటాయంటే?

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Iran Nuclear Negotiations | అణు చర్చలకు ఇరాన్ సుముఖత: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran Nuclear Negotiations | తమ అణు కార్యక్రమానికి...

Water Wastage Fine | నీటి వృథాపై జలమండలి చర్యలు.. రూ.10 వేల జరిమానా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Water Wastage Fine | ప్రస్తుతం ఎండలు...

Gujarat Bus Accident | గుజరాత్‌లో ఘోర ప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gujarat Bus Accident | గుజరాత్​లో ఘోర...