అక్షరటుడే, వెబ్డెస్క్ : IPL Final | రెండు నెలలుగా అభిమానులకు ఉత్సాహాన్ని అందిస్తున్న ఐపీఎల్ నేటితో ముగియనుంది. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఫైనల్ పోరు సాగుతోంది.
గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా సాగుతున్న తుది సమరంలో జీటీ కష్టాల్లో ఉంది. టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన గుజరాత్ ఆది నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆ జట్టు ఓపెనర్, కెప్టెన్ శుభ్మన్ గిల్ (10) 22 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (12) సైతం వెంటనే వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో గుజరాత్ బ్యాటర్లు ఒత్తిడిలో పడ్డారు.
IPL Final | 99 పరుగులకే 5 వికెట్లు
ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. దీంతో గుజరాత్ ఏ దశలోనూ దూకుడుగా ఆడలేదు. 99 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. నిషాంత్ సిందు 20, బట్లర్ 19 పరుగులు చేశారు. ఆర్షద్ ఖాన్ 15 పరుగలకే ఔట్ అయ్యాడు. పవర్ ప్లేలో గుజరాత్ 45 పరుగులు మాత్రమే చేసింది. 16 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్ (28), రాహుల్ తెవాటియా ఉన్నారు.
Krunal Pandya in IPL Finals:
0/31 – MI vs RPS, Hyderabad 2017
1/39 – MI vs CSK, Hyderabad 2019
0/30 – MI vs DC, Dubai 2020
2/17 – RCB vs PBKS, Ahmedabad 2025
1/23 – RCB vs GT, Ahmedabad 2026#RCBvsGT pic.twitter.com/ZpQW9CYRam— CricketGully (@thecricketgully) May 31, 2026
దీనిని కూడా చదవండి : Champions League Celebrations | ఛాంపియన్స్ లీగ్లో గెలుపు.. హింసాత్మకంగా మారిన సంబరాలు


