అక్షరటుడే, వెబ్డెస్క్ : RCB Playoffs Qualification | డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ (RCB) మరోసారి ఐపీఎల్ (IPL) ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించడంతో ప్లే ఆఫ్స్కు క్వాలీఫై అయింది.
ఐపీఎల్లో ఆదివారం సాయంత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నాలుగు వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యార్ 40 బంతుల్లో 73 పరుగులతో రాణించాడు. విరాట్ కోహ్లీ 58, పడిక్కల్ 45 పరుగులు చేశారు. టిమ్ డేవిడ్ చివర్లో 12 బంతుల్లో 28 పరుగులతో ఆకట్టుకున్నాడు.
RCB Playoffs Qualification | ఓపెనర్లు విఫలం
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఈ సీజన్లో నిలకడగా ఆడుతున్న ఆ జట్టు ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (0), ప్రభుమాన్ సింగ్ (2) కీలకమైన మ్యాచ్లో విఫలం అయ్యారు. ఇద్దరు ఓపెనర్లను భువనేశ్వర్ కుమార్ ఔట్ చేశాడు. అనంతరం కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ సైతం ఒక పరుగుకే పెవిలియన్కు చేరాడు. కూపర్ 37, శుయాంస్ 35, స్టోయినిస్ 37, శశాంక్ సింగ్ 56 పరుగులు చేశారు. అయినా మ్యాచ్ను గెలిపించలేకపోయారు. 20 ఓవర్లలో పంజాబ్ 199 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్కు ఇది వరుసగా ఆరో ఓటమి కావడం గమనార్హం.
RCB Playoffs Qualification | పంజాబ్ కష్టమే..
ప్రస్తుతం ఆర్సీబీ 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లింది. గుజరాత్ 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఎస్ఆర్హెచ్ 14, పంజాబ్ 13 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ మ్యాచ్ గెలిస్తే పంజాబ్ ప్లే ఆఫ్స్ చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. తాజా ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్ వెళ్లడం కష్టంగా మారింది. ఇంకో మ్యాచ్లో గెలవడంతో పాటు ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడి పంజాబ్ కింగ్స్ భవిష్యత్ ఉంది.
దీనిని కూడా చదవండి : Dhoni Farewell | ధోనీకి చెపాక్లో వీడ్కోలా..? సీఎస్కే చివరి హోమ్ మ్యాచ్పై భారీ ఉత్కంఠ


