అక్షరటుడే, వెబ్డెస్క్: Velpur VDC | తమను సాంఘిక బహిష్కరణ చేశారని వేల్పూరు గంగపుత్ర సంఘం సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు గ్రామాభివృద్ధి కమిటీపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
వేల్పూర్ (Velpur) గ్రామానికి చెందిన గంగపుత్ర సంఘం సభ్యులు సోమవారం కలెక్టరేట్కు వచ్చారు. వారు మాట్లాడుతూ.. తాము గ్రామంలోని చెరువుల్లో చేపలు పడుతూ జీవిస్తున్నామని చెప్పారు. కొంతకాలంగా గ్రామంలోని వీడీసీ సభ్యులు తమపై అణచివేతకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
Velpur VDC | జరిమానా కట్టకపోవడంతో..
తాము చేపలు పట్టుకోవడానికి వీడీసీ వారు రూ.50 వేల జరిమానా వేశారని సంఘం సభ్యులు పేర్కొన్నారు. ఆ డబ్బులు కట్టకపోవడంతో తమ సంఘంలోని సభ్యులందరిని సాంఘిక బహిష్కరణ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వీడీసీపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Road Accident | నగరంలో రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం..


