అక్షరటుడే, వెబ్డెస్క్ : Gujarat Bus Accident | గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సూరత్ జిల్లా బార్డోలీ దగ్గర రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో మంటలు చెలరేగి ఏడుగురు సజీవదహనం అయ్యారు.
సూరత్ జిల్లాలోని బార్డోలి సమీపంలో ఉన్న ధూలే హైవేపై, మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (MSRTC)కి చెందిన రెండు రాష్ట్ర రవాణా (ST) బస్సులు ఢీకొన్నాయి. ఢీకొన్న వెంటనే ఆ రెండు బస్సుల్లో ఒకటి హైవేపైనే బోల్తా పడింది. క్షణాల్లోనే అది మంటల్లో చిక్కుకుని కాలిపోయింది. ఏడుగురు ప్రయాణికులు ఆ మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Gujarat Bus Accident | పలువురికి తీవ్రగాయాలు
స్థానిక అధికారుల సమాచారం ప్రకారం, ఈ ఘోర ప్రమాదం బార్డోలి తాలూకాలోని ఉవా, మాణెక్పూర్ గ్రామాల మధ్య జరిగింది. మహారాష్ట్ర డిపోకు చెందిన ఒక ST బస్సు, ధూలే నుండి నవాపూర్ మీదుగా సూరత్ వైపు ప్రయాణిస్తోంది. సరిగ్గా అదే సమయంలో, ఎదురుగా వస్తున్న మరొక ST బస్సును అది ఢీకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.
#WATCH | Surat, Gujarat: Seven people have died so far following a road accident involving two buses on the Gujarat-Maharashtra Highway in the Bardoli Tehsil of Surat district: Rajesh Gadhiya (SP, Surat Rural)#gujrat #bus #roadaccident #gujratmaharashtrahighway #northeastlive pic.twitter.com/Tki0MgdfBq
— Northeast Live (@NELiveTV) June 2, 2026
దీనిని కూడా చదవండి : Wedding Clash Attack | తెల్లారితే పెళ్లి.. ఇరువర్గాల గొడవ.. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి


