అక్షరటుడే వెబ్డెస్క్: Ameerpet Fire Accident | నగరంలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన అమీర్పేట్ (మైత్రీవనం)లో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై తెలంగాణ రక్షణ సేన (TRS) వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తులు నష్టపోయిన వ్యాపారులను, బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, వారికి తగిన నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు.

Ameerpet Fire Accident | ఫైర్ డిపార్ట్మెంట్పై అసంతృప్తి..
ప్రమాదం జరిగిన సమయంలో ఫైర్ డిపార్ట్మెంట్ స్పందించిన తీరుపై కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదం సంభవించిన దాదాపు గంటన్నర తర్వాత గానీ ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకోలేదని ఆమె మండిపడ్డారు. అత్యవసర సమయాల్లో ఇంత ఆలస్యంగా అధికారులు స్పందిస్తే, ఇలాంటి పెను ప్రమాదాలను మనం ఎలా అడ్డుకోగలుగుతామని ఆమె ప్రశ్నించారు. నగరంలో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాల నివారణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని, దీనిపై తక్షణమే ఉన్నత స్థాయి సమీక్ష (రివ్యూ) నిర్వహించాలని కవిత కోరారు.

Ameerpet Fire Accident | అసలేం జరిగిందంటే?
అమీర్పేట్ మైత్రీవనం సమీపంలోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్లో గురువారం రోజున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 20కి పైగా దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దట్టమైన పొగలు, ఎగిసిపడిన మంటలతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కాగా, ప్రమాద తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేసిన టీఆర్ఎస్ చీఫ్ కవిత.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అమీర్పేట్ ఫైర్ యాక్సిడెంట్లో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలి: కవిత
ఫైర్ యాక్సిడెంట్ జరిగిన గంటన్నర తరువాత ఫైర్ డిపార్ట్మెంట్ వస్తే ఈ ప్రమాదాలను ఎలా ఆపగలుగుతాం?
దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన రివ్యూని చేపట్టాలి
– TRS వ్యవస్థాపకురాలు కవిత https://t.co/wSOnzxbyPp pic.twitter.com/GoP7mUjoW1
— BIG TV Breaking News (@bigtvtelugu) June 5, 2026
ఇది కూడా చదవండి: Grain Procurement Dispute | ధాన్యం కొనుగోళ్లు చేతగాక.. కేంద్రంపై విమర్శలు : ఎంపీ అర్వింద్
