Medak Tree Removal Dispute | విద్యుత్​ వర్సెస్​ ఫారెస్ట్ అధికారులు.. చెట్ల తొలగింపు అడ్డుకోవడంతో ఉద్రిక్తత

మెదక్​ జిల్లా హవేళి ఘన్​పూర్ మండలంలో విద్యుత్​ శాఖ సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, మెదక్​ : Medak Tree Removal Dispute | మెదక్ (Medak)​ జిల్లా హవేళి ఘన్​పూర్ మండలంలో విద్యుత్​ శాఖ సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనుమతి లేకుండా విద్యుత్ సిబ్బంది అటవీ భూముల్లో చెట్లను తొలగించడంతో వివాదం మొదలైంది.

forest 1

హవేళి ఘన్​పూర్​ మండలంలోని సర్దన కమాన్​ నుంచి బూర్గుపల్లి (Burgupalli) గేటు వరకు విద్యుత్​ శాఖ అధికారులు శనివారం చెట్ల తొలగింపు పనులు చేపట్టారు. విద్యుత్​ తీగల కింద ఉన్న చెట్లను జేసీబీ సాయంతో తొలగించారు. అయితే సమాచారం అందుకున్న ఫారెస్ట్ బీట్​ ఆఫీసర్​ సాయికృష్ణ, మరో సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్నారు. అనుమతి లేకుండా చెట్లు తొలగించడం సరికాదని వారితో చెప్పారు. విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, పూర్తిగా చెట్లు తొలగించడం సరికాదన్నారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది.

Medak Tree Removal Dispute | దాడికి యత్నం

ఈ విషయమై బీట్​ ఆఫీసర్​ సాయికృష్ణను విరవణ కోరగా.. అడవిలో చెట్లు తొలగిస్తున్నారనే సమాచారం రావడంతో తాము వెళ్లి అడ్డుకున్నామని తెలిపారు. అప్పటికే 15 చెట్లను జేసీబీతో తొలగించారన్నారు. అధిక సంఖ్యలో ఉన్న విద్యుత్ సిబ్బంది తమను బెదిరించారని ఆరోపించారు. ఫారెస్ట్ కార్యాలయంతో పాటు తన ఇంటికి విద్యుత్ కనెక్షన్ కట్​ చేస్తామని బెదిరించారన్నారు. అంతేగాకుండా లైన్​మన్​ రాజునాయక్​ తనను అసభ్య పదజాలంతో దూషించారన్నారు. ఆయనకు ఏఈ నవీన్​కుమార్​ సైతం మద్దతు తెలిపారని చెప్పారు. దీంతో తాను వారితో వాగ్వాదం చేశానని తెలిపారు. వారు ఎక్కువ మంది ఉండి తనపై దాడికి యత్నించారని ఆరోపించారు.

Medak Tree Removal Dispute | పోలీసులకు ఫిర్యాదు

ఈ ఘటన అనంతరం ఇరు శాఖల సిబ్బంది ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అయితే పోలీస్​ స్టేషన్​ బయట మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యుత్​ శాఖలో ఆపరేటర్​ ప్రతాప్​ రెడ్డి అనే వ్యక్తి ఫారెస్ట్​ అధికారులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఏడీఈ మోహన్ బాబు, కంప్యూటర్ ఆపరేటర్ ప్రతాప్ రెడ్డి పోలీసుల ముందే తమను బెదిరించారని ఫారెస్ట్​ సిబ్బంది చెప్పారు. ఇష్టం వచ్చినట్లు తిట్టారన్నారు. గతంలో సైతం బీట్​ ఆఫీసర్​ హరి నాయక్​పై ఇలాగే దౌర్జన్యం చేశారని ఫారెస్ట్ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.

Medak Tree Removal Dispute | మా బాధ్యత

తాము చెట్ల తొలగింపును అడ్డుకున్నందుకు.. విద్యుత్ రాకుండా చేస్తున్నారని గ్రామస్తులను విద్యుత్​ శాఖ సిబ్బంది రెచ్చగొడుతున్నారని ఫారెస్ట్ అధికారులు ఆరోపించారు. తాము పనులను అడ్డుకోవడం లేదని, అడవిని కాపాడటం తమ బాధ్యత అన్నారు. నిబంధనల మేరకు పనులు చేపట్టాలని కోరారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పనులను అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులపై దౌర్జన్యం చేయడం సరికాదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏదైనా ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని, కానీ ఇలా బెదిరింపులకు దిగడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు.

 

దీనిని కూడా చదవండి : Hyderabad Heavy Rains | వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు సీఎం ఆదేశం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *