Sisters Missing Case | తల్లి మందలించిందని.. ఇంట్లోంచి వెళ్లిపోయిన అక్కాచెల్లెళ్లు

తల్లి మందలించిందని ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన హైదరాబాద్​ నగరంలో చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sisters Missing Case | తల్లి మందలించిందని ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన హైదరాబాద్​ (Hyderabad)  నగరంలో చోటు చేసుకుంది.

నగరంలోని పాతబస్తీ ఫలక్​నుమాకు చెందిన ముగ్గురు మైనర్​ అక్కాచెల్లెళ్లు నిత్యం ఫోన్​ ఎక్కువగా వాడుతున్నారు. ఫోన్​కు బానిస కావడంతో వారిని ఇటీవల తల్లి మందలించింది. దీంతో ముగ్గురు కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ముగ్గురు బిడ్డలు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Sisters Missing Case | ఏలూరులో ఆచూకీ లభ్యం

ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్.శ్రీనివాస్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, అర్ధరాత్రి వరకు స్టేషన్‌లోనే ఉండి దర్యాప్తును పర్యవేక్షించారు. సీసీ కెమెరాలు, సాంకేతికత సాయంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఏలూరులో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వారిని సురక్షితంగా రక్షించి, తల్లిదండ్రులకు అప్పగించారు.

ఇది కూడా చదవండి..: DTO Venkanna Death | డీటీవో మృతిపై విచారణకు ఆదేశం : మంత్రి పొన్నం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *