DTO Venkanna Death | డీటీవో మృతిపై విచారణకు ఆదేశం : మంత్రి పొన్నం

జయశంకర్​ భూపాలపల్లి డీటీవో వెంకన్న మృతిపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: DTO Venkanna Death | జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రవాణ శాఖాధికారి(DTO) వెంకన్న మృతిపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

డీటీవో వెంకన్న జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో బొగ్గు లోడ్​తో వెళ్తున్న వాహనం వేగంగా ఆయనపై దూసుకొచ్చింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ డీటీవో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు టిప్పర్​ డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్​ సైతం స్పందించారు.

DTO Venkanna Death | అండగా ఉంటాం

విధినిర్వహణ లో ఉన్న డీటీవో వెంకన్న మృతి తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందని పొన్నం ప్రభాకర్​​ (Ponnam Prabhakar) ఉన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. వెంకన్న మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి..: Bhupalpally DTO Death | వాహనాలు తనిఖీ చేస్తుండగా దూసుకొచ్చిన బొగ్గు టిప్పర్​.. డీటీవో మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *