అక్షరటుడే, లింగంపేట: Paddy Procurement | ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని.. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ఆదేశించారు. లింగంపేట మండలం అయ్యప్పపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు.
Paddy Procurement | కేంద్రాల్లో ఇబ్బందులు రావొద్దు..
ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తూకం, తేమ శాతం పరీక్ష, గన్నీ బ్యాగుల లభ్యత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వరి సేకరణకు సంబంధించిన సివిల్ సప్లయ్స్ (Civil Supplies), మార్కెటింగ్, ఐకేపీ, పీఏసీఎస్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని, కొనుగోలు ప్రక్రియలో ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తూకం జరగగానే ధాన్యం సొమ్ము చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, నీడ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఓపీఎంఎస్ ట్యాబ్ (OPMS Tab)లో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలని చెప్పారు. నమోదులో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: Additional DCP | బాధ్యతలు స్వీకరించిన అదనపు డీసీపీ శుభం ప్రకాశ్

