అక్షరటుడే, వెబ్డెస్క్: HYDRAA Alwal Demolitions | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, నాలాలతో పాటు ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు కేటాయించిన స్థలాలను కబ్జా చెరల నుంచి విడిపిస్తోంది. తాజాగా అల్వాల్లో 108 ఎకరాల్లో అక్రమ నిర్మాణాల తొలగింపు కోసం భారీ ఆపరేషన్ చేపట్టింది.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అల్వాల్లోని సర్వే నెం.1లో శనివారం తెల్లవారుజామున హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. భారీ పోలీస్ బందోబస్తు, DRF బలగాల మధ్య అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నారు. ఇక్కడ 108 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో హైడ్రా రంగంలోకి దిగింది.
HYDRAA Alwal Demolitions | నాయకుల హస్తం

అల్వాల్లోని 108 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రతిపక్ష నేతలు, మాజీ, ప్రస్తుత ప్రజాప్రతినిధుల అండదండలతోనే కబ్జా చేసి అమ్మకాలు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇక్కడ పలు నిర్మాణాలు వెలిశాయి. అన్యాక్రాంతమైన ఈ భూమిని కాపాడేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల సమక్షంలో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు.
#Hyderabad | అల్వాల్లో హైడ్రా కూల్చివేతలు
అల్వాల్ పరిధిలో అక్రమంగా వెలసిన కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అన్యాక్రాంతమైన 108 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ఈ చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.#HYDRAA… pic.twitter.com/GDMFk1fnaN
— Akshara Today | Telugu News (@aksharatoday) June 27, 2026
ఇది కూడా చదవండి..: Donald Trump Avenue | భారత్కు ట్రంప్ కృతజ్ఞతలు.. ఎందుకో తెలుసా?