అక్షరటుడే, వెబ్డెస్క్: Idupu Kayitham Controversy 1 | ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవల ప్రారంభమైంది. అయితే సినిమా టైటిల్పై సోషల్ మీడియాలో కొందరు చేసిన పోస్టులు వివాదానికి దారితీశాయి.
ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు నరేశ్ స్పందిస్తూ, సినిమా పేరును అనవసరంగా వివాదాస్పదం చేయడం సరికాదన్నారు. సినిమాను సినిమాగానే చూడాలని, ప్రతి అంశాన్ని వివాదంగా మార్చడం మంచిది కాదని సూచించారు.

Idupu Kayitham Controversy 1 | ‘కరుప్పు’, ‘కాంతార’ వంటి పేర్ల అర్థాలు
ఇతర భాషల చిత్రాలైన ‘కరుప్పు’, ‘కాంతార’ వంటి పేర్ల అర్థాలు అందరికీ తెలియకపోయినా ప్రేక్షకులు వాటిని ఆదరించి విజయవంతం చేశారని గుర్తుచేశారు. అదే విధంగా ‘ఇడుపు కాయితం’ చిత్రాన్ని కూడా ముందస్తు అభిప్రాయాలతో కాకుండా, సినిమా విడుదలైన తర్వాత చూసి అంచనా వేయాలని అన్నారు.
టైటిల్పై కొనసాగుతున్న వివాదానికి ఇక్కడితో ముగింపు పలికి, తెలుగు భాషను, సంస్కృతిని పరిరక్షించే దిశగా అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నరేశ్ పిలుపునిచ్చారు.