అక్షరటుడే, వెబ్డెస్క్ : RTC Workers Protest | ఆర్టీసీ కార్మికులు పోలీసుల కాళ్లు మొక్కారు. నర్సంపేట డిపో (Narsampeta Depot)కు శంకర్ గౌడ్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వేడుకున్నారు. అయితే ఇందుకు పోలీసులు ఒప్పుకోవడం లేదు.
వరంగల్ జిల్లా (Warangal District) నర్సంపేట డిపోలో డ్రైవర్గా పని చేస్తున్న శంకర్గౌడ్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని ఆయన స్వగ్రామం ముత్తోజిపేటకు తీసుకు వెళ్లారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని డిపో వద్దకు తీసుకు వెళ్లడానికి అనుమతించాలని కార్మికులు కోరుతున్నారు. మరోవైపు శంకర్ గౌడ్ కు నివాళులు అర్పించడానికి భారీగా ఆర్టీసీ కార్మికులు (ఆర్టీసీ కార్మికులు) చేరుకుంటున్నారు.
RTC Workers Protest | మాజీ మంత్రి నివాళులు
శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ (Former Minister Satyavathi Rathod) నివాళులు అర్పించారు. కార్మికుల డిమాండ్ మేరకు శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకి తీసుకెళ్లలా అనుమతి ఇవ్వాలని పోలీసులతో మాట్లాడారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ వాహనం ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆర్టీసీ యూనియన్ నాయకులు శంకర్ గౌడ్ నివాసానికి చేరుకోగా పోలీసులు అరెస్ట్ చేశారు.
నర్సంపేట డిపోకు శంకర్ గౌడ్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను వేడుకుంటూ, వారి కాళ్లు పట్టుకున్న ఆర్టీసీ కార్మికులు… అయితే పోలీసులు మాత్రం అనుమతి ఇవ్వడంపై నిరాకరణ..
శంకర్ గౌడ్ కు నివాళులు అర్పించడానికి భారీగా చేరుకుంటున్న ఆర్టీసీ కార్మికులు pic.twitter.com/MbACORZyTV
— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) April 24, 2026
ఇది కూడా చదవండి..: RTC Driver | మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

