అక్షరటుడే, నర్సంపేట: Narsampet Tension | వరంగల్ జిల్లా (Warangal District) నర్సంపేట మండలం ముత్తోజిపేట గ్రామం ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య ఘటనతో అట్టుడుకుతోంది. ఆయన మృతదేహాన్ని నర్సంపేట ఆర్టీసీ డిపోకు తరలించే క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Narsampet Tension | పెద్ద ఎత్తున వాగ్వాదం:
శంకర్ గౌడ్కు నివాళులర్పించేందుకు ఆయన మృతదేహాన్ని నర్సంపేట డిపో వరకు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు, ఆర్టీసీ కార్మికులు నిర్ణయించారు. అయితే, శాంతిభద్రతల సాకుతో పోలీసులు ఇందుకు అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా కార్మికులు భారీ ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు.
Narsampet Tension | బండి సంజయ్ రంగంలోకి :
ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్వయంగా రంగంలోకి దిగారు. బాధితుడి భౌతిక కాయాన్ని డిపోకు తరలించే వరకు తాను కదిలేది లేదని ఆయన తెగేసి చెప్పారు.
మంత్రి ప్రశ్న: “22 ఏళ్లు ఒకే చోట పనిచేసిన వ్యక్తికి తోటి కార్మికులు నివాళులర్పిస్తే వచ్చిన అభ్యంతరం ఏమిటి? ఎందుకు అనవసరంగా అడ్డుకుంటున్నారు?” అని పోలీసులను నిలదీశారు.
బండి సంజయ్కు ఫోన్: ఈ క్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ బండి సంజయ్కు ఫోన్ చేసి ప్రభుత్వ ఆదేశాలను వివరించే ప్రయత్నం చేశారు. కానీ, కుటుంబ సభ్యుల మనోభావాలను గౌరవించాలని మంత్రి స్పష్టం చేశారు.
శంకర్ గౌడ్ కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని, ఆత్మాహుతికి ప్రేరేపించిన పరిస్థితులపై విచారణ జరపాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: RTC Compensation | ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం.. ఒకరికి ఉద్యోగం”