అక్షరటుడే వెబ్డెస్క్: Jaish Module Arrest | భారతదేశంలో భారీ పేలుళ్లకు ప్లాన్ చేస్తున్న ఉగ్రవాద నెట్వర్క్ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) విజయవంతంగా అడ్డుకుంది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తోన్న నిషేధిత ‘జైష్-ఎ-మొహమ్మద్’ (JeM) ఉగ్రవాద సంస్థకు చెందిన మాడ్యూల్పై ఏటీఎస్ అధికారులు ఉక్కుపాదం మోపారు.
Jaish Module Arrest | ఐదుగురు ఉగ్రవాదులు..
నిఘా వర్గాల సమాచారంతో గుజరాత్లోని పటాన్ జిల్లా, సిద్ధ్పూర్ తాలూకా ఖాదియాల్ గ్రామంలో ఏటీఎస్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్లో ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 3వ తేదీన గుజరాత్, మధ్యప్రదేశ్లలో ఎనిమిది మంది జైష్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారిని విచారించగా బయటపడిన కీలక సమాచారం ఆధారంగానే, ప్రస్తుతం ఈ తాజా అరెస్టులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Jaish Module Arrest | నిందితుల అరెస్ట్..
అరెస్టయిన వారిని బిలాల్ ఆబిద్ షేరా, మహమ్మద్ అయూబ్ కాడీవాలా, మహమ్మద్ షఫీ ముఖీ, మహ్మద్ హసన్ కరాడియా, మహ్మద్ అయూబ్ సునాసరాగా గుర్తించారు. నిందితుల్లో ఒకరు గతంలో టైమ్ బాంబు తయారు చేసేందుకు ప్రయత్నించినట్లు విచారణలో తేలింది. వీరి వద్ద నుంచి బాంబు తయారీకి కావాల్సిన సామాగ్రి, ఉర్దూ భాషలో ఉన్న జిహాదీ సాహిత్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కోర్టు ఈ నిందితులను జులై 24 వరకు ఏటీఎస్ కస్టడీకి అప్పగించింది. ఈ ఉగ్రవాద నెట్వర్క్కు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
Gujarat: The Gujarat Anti-Terrorism Squad (ATS) has arrested five more accused from various districts of the state, intensifying its crackdown on a Pakistan-based Jaish-e-Mohammed (JeM) terror module pic.twitter.com/FKBYqUDeMz
— IANS (@ians_india) July 17, 2026
ఇది కూడా చదవండి: US Airstrikes Chabahar | ఇరాన్లోని చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు