అక్షరటుడే,కోటగిరి : SIR Forms | ఎస్ఐఆర్(SIR) ఫారాలను బీఎల్వోలకు తిరిగి అందజేసి ప్రజలను తమన ఓటుహక్కును(Voter Registration) కాపాడుకోవాలని బీజేపీ(BJP) రాష్ట్ర నాయకులు యెండల లక్ష్మీనారాయణ(Yendala Lakshminarayana) అన్నారు. శనివారం పోతంగల్ మండల కేంద్రంలో ఎంఎంఆర్ ఫంక్షన్ హాల్లో బీజేపీ నాయకులతో కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
SIR Forms | రైతులు ఆరుతడి పంటలపై మొగ్గు చూపాలి
ఆయన మాట్లాడుతూ.. సర్ నమోదు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. గడువు వచ్చేనెల 3వ తేదీ వరకు పొడిగించినప్పటికీ ఫారాలను త్వరగా బీఎల్వోలకు అందిస్తే డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఎల్నినో ప్రభావం రాష్ట్రంపై ఎక్కువగా ఉందన్నారు. వర్షాలు ఆశించిన రీతిలో పడట్లేదు కాబట్టి రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని యెండల సూచించారు. జొన్నలు, శనగలు, నువ్వులు తదితర పంటలు సాగు చేయాలన్నారు.
అనవసరంగా ఖర్చులు పెంచుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడవద్దని ఆయన సూచించారు. నీటి కరువును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్నారు. రైతుల కోసం పీఎం ఫసల్ యోజన బీమా పథకాన్ని అమలు చేసి పంట నష్టపోయిన రైతులకు లబ్ధి చేకూరేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కల్లూరి హన్మాండ్లు (బజరంగ్), ఓమన పటేల్, సంతోషం పటేల్, మక్కయ్య, శంకర్, విజయ్, నాగయ్య, నహీముద్దీన్, అశోక్, శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.