Nagaland Landslide | నాగాలాండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. నలుగురి మృతి

నాగాలాండ్​లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nagaland Landslide | నాగాలాండ్​లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు.

మోన్ జిల్లాలో ఆదివారం భారీ వర్షాలు (Heavy Rains) కురిశాయి. దీంతో కొండచరియలు విరిగిపడి పిల్లలతో సహా ఎనిమిది మంది మరణించినట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ వర్షాల కారణంగా ఆ ప్రాంతంలో ఆకస్మిక వరదలు కూడా సంభవించాయి. ఇప్పటి వరకు నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనలో అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. కొండచరియ విరిగిపడిన తర్వాత ఆ ప్రాంతంలోకి భారీగా నీరు ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలు కష్టతరంగా మారాయని పోలీసులు తెలిపారు.

Nagaland Landslide | మృతులకు రూ.4 లక్షల పరిహారం

ఈ ఘటనపై నాగాలాండ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మోన్ జిల్లాతో పాటు, మోకోక్‌చుంగ్ జిల్లాలోని తూలిలో తీవ్ర నష్టం వాటిల్లింది. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. 74,000 తక్షణ ఎక్స్-గ్రేషియా సహాయాన్ని ముఖ్యమంత్రి నైఫియు రియో ప్రకటించారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే ప్రజలు సైతం ప్రమాదకరమైన వాలు ప్రాంతాలు, నదీ తీరాలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరారు.

 

దీనిని కూడా చదవండి : Trainee IPS Harassment | ట్రైనీ ఐపీఎస్​కు లైంగిక వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *