Madanapalle ATM Theft | గన్​తో బెదిరించి.. ఏటీఎం మిషన్​ చోరీ

దొంగలు ఏకంగా ఏటీఎం మిషన్​ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఏపీలోని అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Madanapalle ATM Theft | దొంగలు ఏకంగా ఏటీఎం మిషన్​ను ఎత్తుకెళ్లారు. అడ్డుకున్న స్థానికులను గన్​తో బెదిరించారు. ఈ ఘటన ఏపీలోని అన్నమయ్య జిల్లా (Annamayya District)లో చోటు చేసుకుంది.

మదనపల్లెలో శుక్రవారం అర్ధరాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని SBI ఏటీఎంను ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో కొందరు స్థానికులు చూసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే దొంగలు వారికి గన్​ చూపించి బెదిరించారు. నలుగురు దొంగలు బొలెరో వాహనంలో వచ్చి ఏటీఎంను తీసుకొని పరారు అయ్యారు.

Madanapalle ATM Theft | ప్రత్యేక బృందాలతో గాలింపు

ఏటీఎం చోరీ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బొలెరో వాహనంలో ఏటీఎంను తీసుకు వెళ్లినట్లు గుర్తించారు. నిందితులు వాయల్పాడు, కూరపర్తి, నిమ్మనపల్లి మీదుగా పరారు అయ్యారు. వారి కోసం పోలీసులు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల దొంగల కోసం గాలిస్తున్నాయి. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఏటీఎంలో రూ.10 లక్షల వరకు నగదు ఉన్నట్లు సమాచారం.


ఇది కూడా చదవండి..: Chandrababu School Visit | విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు, నారా లోకేశ్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *