అక్షర టుడే, బోధన్: Bodhan Municipality | బోధన్ మున్సిపాలిటీలో మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ (ఆర్డీ) షాహిద్ మసూద్ మంగళవారం విచారణ చేపట్టారు. ఉదయమే బోధన్ (Bodhan) పట్టణానికి చేరుకున్న ఆయన బల్దియాలో సమీక్ష నిర్వహించారు.
Bodhan Municipality | గతంలో జరిగిన అవకతవకలపై..
కమిషనర్ ఛాంబర్లో సుమారు రెండు గంటల పాటు సమీక్ష నిర్వహించారు. గతంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై లోతుగా విచారణ జరిపినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా, 16వ వార్డులోని శ్మశానవాటిక ప్రహరీ నిర్మాణానికి కేటాయించిన రూ.20 లక్షల నిధుల వినియోగంపై అందిన ఫిర్యాదు మేరకు ఆర్డీ ఈ విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో బోధన్ మున్సిపల్ కమిషనర్ యాదవ్ కృష్ణ, మాజీ డీఈ శివానందం, ఏఈ శ్రీనివాస్, మాజీ ఛైర్మన్ ఎల్లయ్య, మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఇలియాస్ అలీ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Fee Reimbursement | ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే జిల్లావ్యాప్తంగా ఆందోళనలు