అక్షరటుడే, బోధన్: Navipet Railway Gate | నవీపేట్ (Navipet) రైల్వేగేట్ వద్ద గుంతలతో వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని నవీపేట్ పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ‘అక్షరటుడే’లో ‘అలసత్వపు గుంతల్లో.. నలిగిపోతున్న నవీపేట్ ప్రయాణం’ శీర్షికతో కథనం ప్రచురించగా రైల్వేశాఖ స్పందించింది.
Navipet Railway Gate | తారుతో గుంతల పూడ్చివేత..
నవీపేట్ పాలకవర్గం విన్నపాలు.. ‘అక్షరటుడే’లో కథనం ప్రచురితం కావడంతో రైల్వే శాఖ అధికారులు స్పందించారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొనడంతో రైల్వే సిబ్బంది తక్షణమే ఆ గుంతలను తారుతో పూడ్చివేశారు. ఈ సందర్భంగా నవీపేట్ సర్పంచ్, ఉపసర్పంచ్ పాలక వర్గం సభ్యులు మాట్లాడుతూ.. చాలారోజులుగా గుంతలవల్ల అవస్థలు పడ్డామని.. ‘అక్షరటుడే’లో కథనం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారన్నారు. అధికారులు గుంతలు పూడ్చివేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ ‘అక్షరటుడే’కు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇది కూడా చదవండి..: Congress Leader Death | గుండెపోటుతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి