Lashkar Bonalu | లష్కర్​ బోనాలు.. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో సీఎం రేవంత్​రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lashkar Bonalu | సికింద్రాబాద్​లో లష్కర్​ బోనాల జాతర ఘనంగా సాగుతోంది. మహంకాళి అమ్మవారికి నగరవాసులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు.

బోనాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకున్నారు. ఆయనకు అధికారులు, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క​ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు.

Lashkar Bonalu | ప్రత్యేక పూజలు చేసిన కేటీఆర్​​

మహంకాళి అమ్మవారి ఆలయాన్ని బీఆర్​ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ (KTR) దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు బాగా పడాలని ప్రార్థించినట్లు తెలిపారు. బోనాలను బీఆర్​ఎస్​ హయాంలో రాష్ట్ర పండుగగా గుర్తించామన్నారు.

Lashkar Bonalu | భక్తజన సందడి

లష్కర్​ బోనాల నేపథ్యంలో నగరంలో సందడి నెలకొంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి భారీగా భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ సమీపంలో ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Tanvi Sharma | తైపీ ఓపెన్​.. చరిత్ర సృష్టించిన తన్విశర్మ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *