అక్షరటుడే, బోధన్: Hanuman Farm Substation | నవీపేట్ మండలం (Navipet Mandal)లోని హనుమాన్ ఫాం గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభానికి సిద్ధమైంది. ట్రాన్స్కో చీఫ్ ఇంజనీర్ (కన్స్ట్రక్షన్) చౌహాన్ జైవంత్రావు, జిల్లా ఎస్ఈ పీవీ రాజేశ్వరరావు సోమవారం సాంకేతిక తనిఖీలు నిర్వహించారు.
Hanuman Farm Substation | ఉపకేంద్రం ఛార్జ్..
ఎలాంటి లోపాలు లేవని నిర్ధారించిన అనంతరం వారిరువురు ఉపకేంద్రాన్ని ఛార్జ్ చేశారు. ఈ ఉపకేంద్రం ద్వారా హనుమాన్ ఫాం, పోతంగల్ గ్రామాలకు, చుట్టుపక్కల ప్రాంతాల వ్యవసాయ, గృహ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందుతుందని చీఫ్ ఇంజనీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఫెన్స్, ఆపరేషన్స్, కన్స్ట్రక్షన్ విభాగాల అధికారులు ఎం. శ్రీనివాసరావు, డి. వెంకటరమణ, స్వామి, తోట రాజశేఖర్, జి. ప్రశాంత్ రెడ్డి, కె. నటరాజ్, ఏ. కాశీనాథ్, ఆనంద్, జి. శ్రీనివాస్, భాస్కర్ ప్రసాద్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ నరేందర్ నాయక్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Police Prajavani | పోలీస్ ప్రజావాణికి 30 ఫిర్యాదులు..