Cattle Smuggling | పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా : ఎస్పీ రాజేష్ చంద్ర

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Cattle Smuggling | బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లాలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా, పటిష్ట బందోబస్తు (Kamareddy police) ఏర్పాటు చేశామని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్​ కార్యాలయంలో జిల్లాలోని పోలీస్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమీక్ష నిర్వహించారు.

Cattle Smuggling | అవాంఛనీయ సంఘటనలు జరగకుండా..

ఎస్పీ మాట్లాడుతూ.. బక్రీద్(Bakrid) సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లాలోని అన్ని ఈద్గాలు, ప్రధాన మసీదులు, జామియా మసీద్ ప్రాంతాలలో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రధాన మార్కెట్లు, పశువుల సంతలు, వాణిజ్య సముదాయాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసరాల్లో నిఘా ఉంటుందన్నారు. జిల్లా సరిహద్దుల్లోని అన్ని తనిఖీ చెక్ పోస్టులు, ప్రధాన రహదారులు, హైవేలపై 24/7 నిఘా ఉంటుందన్నారు.

గతంలో సమస్యలు తలెత్తిన ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక నిఘా విభాగాలు, పికెట్స్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అన్ని ముఖ్య కూడళ్లు, ఈద్గాల వద్ద సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు మున్సిపల్, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ చెక్‌పోస్టుల వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని, అనుమతి లేకుండా పశువులను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: ACB Trap | భూ సర్వే చేసినందుకు లంచం.. ఏసీబీకి చిక్కిన సర్వేయర్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *