అక్షరటుడే వెబ్డెస్క్: Air India Crash Report | అహ్మదాబాద్లో(Ahmedabad) జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద దర్యాప్తునకు సంబంధించి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఎలాంటి తాత్కాలిక లేదా మధ్యంతర దర్యాప్తు నివేదికను (Interim Probe Report) విడుదల చేయబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్న ‘ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’ (AAIB).. నేరుగా పూర్తి వివరాలతో కూడిన తుది నివేదికను (Final Report) సిద్ధం చేసే పనిలో ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి.
Air India Crash Report | వ్యూహాత్మకంగానే మధ్యంతర నివేదికకు బ్రేక్..
ఈ ప్రమాదానికి సంబంధించి టెక్నికల్ డేటా, కాక్పిట్ వాయిస్ రికార్డర్ (CVR), ఫ్లైట్ డేటా రికార్డర్ (బ్లాక్ బాక్స్) విశ్లేషణలు ఇప్పటికే చివరి దశకు చేరుకున్నాయి. అయితే, మధ్యంతర నివేదికను విడుదల చేస్తే దాని ఆధారంగా రకరకాల తప్పుడు ప్రచారాలు (Speculations), ఊహాగానాలు వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు భావించారు. అందుకే, గందరగోళానికి తావివ్వకుండా నేరుగా పూర్తి స్థాయి నివేదికను బయటపెట్టడమే ఉత్తమమని కేంద్రం ఒక ముగింపునకు వచ్చింది.

Air India Crash Report | మరికొద్ది వారాల్లోనే ఫైనల్ రిపోర్ట్..
ప్రస్తుతం AAIB నిపుణుల బృందం.. విమాన తయారీ సంస్థకు చెందిన ఇంజనీర్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) రికార్డులు, అలాగే ప్రమాదం జరిగిన నాటి వాతావరణ పరిస్థితులపై సమగ్ర సమాచారాన్ని సేకరిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ఉండేందుకు అవసరమైన కఠినమైన సిఫార్సులతో కూడిన తుది నివేదికను మరికొద్ది వారాల్లోనే ఈ సంస్థ ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ ఫైనల్ రిపోర్టు ఆధారంగానే ప్రమాదానికి కారకులైన వారిపై తదుపరి చట్టపరమైన, క్రమశిక్షణా చర్యలు ఉంటాయని పౌర విమానయాన శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.
ఇది కూడా చదవండి: Vijay Krishna | బీజేవైఎం రాష్ట్ర కోశాధికారిగా అమంద్ విజయ్ కృష్ణ


