అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Child Kidnapping | నగరంలోని జీజీహెచ్ (GGH Nizamabad) వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. కొన్నినెలల క్రితం నవజాత మృతదేహం డ్రైనేజీలో లభ్యం కావడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న మాతాశిశు ఆస్పత్రిలో బాలుడి కిడ్నాప్ ఉదంతం కలకలం రేపుతోంది.
Nizamabad Child Kidnapping | ఆస్పత్రిలో ఆడుకుంటుండగా..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాల్కొండ మండలంలోని నాగపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు తమ ఇద్దరి పిల్లలతో జీజీహెచ్కు అనుబంధంగా ఉన్న మాతశిశు ఆస్పత్రికి వచ్చారు. తల్లిదండ్రులు ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం వైద్యులతో మాట్లాడుతుండగా.. ఇద్దరు బాలురు ఆస్పత్రి ఆవరణలో ఆడుకుంటున్నారు. అయితే ఇద్దరిలో రెండున్నరేళ్ల చిన్నబాలుడిని ఓ మహిళ తీసుకెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు. బాలుడి మిస్ అయ్యాడనే సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే 112కు కాల్ చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: దుర్గం చెరుపై KTR ట్వీట్