అక్షరటుడే వెబ్డెస్క్: Prashna Ravan UAPA Case | సోషల్ మీడియా వేదికగా విద్వేష పూరిత ప్రసంగాలు, నిషేధిత భావజాల ప్రచారం చేశారనే ఆరోపణలతో చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA) కింద అరెస్టయిన యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ‘ప్రశ్న’ రావణ్ కేసుకు సంబంధించిన విచారణ గన్నవరం కోర్టు నుంచి విజయవాడకు బదిలీ అయింది. ఆయనపై నమోదైన తీవ్రమైన ఉపా (UAPA) చట్టం సెక్షన్ల పరిధి, న్యాయ పరిమితుల దృష్ట్యా.. ఈ కేసు రికార్డులను గన్నవరం కోర్టు నుంచి విజయవాడ 2వ అదనపు జిల్లా జడ్జి (ADJ) కోర్టుకు, అలాగే ప్రత్యేక ఎన్ఐఏ (NIA) కోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉపా చట్టం కింద నమోదైన ప్రత్యేక కేసుల విచారణ ప్రత్యేక అధికార పరిధి కలిగిన కోర్టుల్లోనే జరగాల్సి ఉండటంతో ఈ బదిలీ ప్రక్రియను పూర్తి చేశారు.
Prashna Ravan UAPA Case | కస్టడీ పిటిషన్పై కొనసాగుతున్న వాదనలు..
మరోవైపు ఈ కేసులో లోతైన దర్యాప్తు జరపాల్సి ఉందని, నిందితుడిని పోలీసు కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్పై విజయవాడ కోర్టులో న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. నిందితుడి డిజిటల్ కంటెంట్, నిషేధిత సిద్ధాంతాల ప్రచారం, సంబంధిత నెట్వర్క్లపై సమగ్ర విచారణ జరపాల్సి ఉన్నందున కస్టడీ అనివార్యమని ప్రాసిక్యూషన్ వాదించగా.. ఆయన తరపు న్యాయవాదులు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం కస్టడీ పిటిషన్పై తదుపరి విచారణ మరియు ఉత్తర్వుల కోసం తగిన తేదీని ఖరారు చేసింది.
యూట్యూబర్ జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ కేసులు విజయవాడకు బదిలీ!
కేసును గన్నవరం కోర్టు నుంచి విజయవాడ 2వ ADJ కోర్టుకు బదిలీ.
UAPA చట్టం కింద నమోదైన కేసులు విజయవాడ NIA కోర్టుకు బదిలీ.
జోసెఫ్ రావణ్ కస్టడీ పిటిషన్పై మళ్లీ వాదనలు.#PrashnaRavan #NIA pic.twitter.com/c3lXoE6WP9
— C L N Raju (@clnraju) August 18, 2026
ఇది కూడా చదవండి: KBR Park One Way | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే విధానం అమలు