RTC Diesel Crisis | ఆర్టీసీపై డీజిల్ కొరత ప్రభావం.. అధికారులపై మంత్రి సీరియస్!

Balla Sandeep Kumar

అక్షరటుడే, అమరావతి: RTC Diesel Crisis | ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో పెట్రోల్, డీజిల్ కొరత సెగ ఆర్టీసీ బస్సులకు తాకింది. రాష్ట్రవ్యాప్తంగా పలు డిపోల్లో డీజిల్ నిల్వలు నిండుకోవడంతో బస్సు సర్వీసుల నిర్వహణ కష్టతరంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో డీజిల్ లేక బస్సులు మార్గమధ్యలోనే నిలిచిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

RTC Diesel Crisis | మంత్రి సమీక్ష:

డీజిల్ కొరతపై రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Ramprasad Reddy) ఉన్నతాధికారులతో అత్యవసరంగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. డీజిల్ సరఫరాలో ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రయాణికులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

RTC Diesel Crisis | ప్రజలకు విజ్ఞప్తి:

ఈ క్లిష్ట సమయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వానికి , అధికారులకు సహకరించాలని మంత్రి కోరారు. ఇంధన సరఫరాను పునరుద్ధరించడానికి చమురు సంస్థలతో సమన్వయం చేసుకుంటూ, త్వరలోనే పరిస్థితిని చక్కదిద్దుతామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: AP Fuel Crisis | ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం.. బంకులు మూసివేత‌, అక్క‌డ మాత్రం ఉచిత ఇంధన పంపిణీ

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *