అక్షరటుడే, అమరావతి: RTC Diesel Crisis | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పెట్రోల్, డీజిల్ కొరత సెగ ఆర్టీసీ బస్సులకు తాకింది. రాష్ట్రవ్యాప్తంగా పలు డిపోల్లో డీజిల్ నిల్వలు నిండుకోవడంతో బస్సు సర్వీసుల నిర్వహణ కష్టతరంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో డీజిల్ లేక బస్సులు మార్గమధ్యలోనే నిలిచిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
RTC Diesel Crisis | మంత్రి సమీక్ష:
డీజిల్ కొరతపై రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Ramprasad Reddy) ఉన్నతాధికారులతో అత్యవసరంగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. డీజిల్ సరఫరాలో ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రయాణికులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
RTC Diesel Crisis | ప్రజలకు విజ్ఞప్తి:
ఈ క్లిష్ట సమయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వానికి , అధికారులకు సహకరించాలని మంత్రి కోరారు. ఇంధన సరఫరాను పునరుద్ధరించడానికి చమురు సంస్థలతో సమన్వయం చేసుకుంటూ, త్వరలోనే పరిస్థితిని చక్కదిద్దుతామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: AP Fuel Crisis | ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం.. బంకులు మూసివేత, అక్కడ మాత్రం ఉచిత ఇంధన పంపిణీ


[…] […]