అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: TGEJAC Dharna Nizamabad | టీజీఈజేఏసీ నిజామాబాద్ ఆద్వర్యంలో (Nizamabad) ఆధ్వర్యంలో ధర్నాచౌక్లో ఈనెల 27న ఆందోళన నిర్వహించనున్నట్లు టీజీఈజేసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని సంఘం కార్యక్రమంలో మాట్లాడారు. TGEJAC
TGEJAC Dharna Nizamabad | టీజీఈజేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో..
టీజీఈజేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 27న ఉదయం పదిగంటలకు ధర్నా చౌక్లో ధర్నా చేపట్టనున్నట్లు వివరించారు. ఆరు పెండింగ్ డీఏలను విడుదల చేయాలని.. రెండో పీఆర్సీ అమలు చేయాలన్నారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ప్రతినెలా రూ. 2 వేల కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ను రద్దు చేసి, ఓపీఎస్ను వెంటనే అమలు చేయాలని, ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకం (NEHS) విధివిధానాలు అమలు చేసి తక్షణమే ఆరోగ్య సేవలు ప్రారంభించాలని కోరారు.
ఇలా మొత్తంగా 64 అంశాలతో కూడిన ఉద్యోగుల డిమాండ్లను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించబోతున్న మహా ధర్నాకు అన్ని శాఖల ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ హాజరుకావాలని కోరారు.
ఇది కూడా చదవండి..: Turmeric Farmers Honoured | పసుపుబోర్డు కార్యాలయంలో రైతులకు గవర్నర్ సన్మానం