Veligonda Project | వెలిగొండ ప్రాజెక్ట్ తొలి దశను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

మార్కాపురం జిల్లా గంటవానిపల్లిలో వెలిగొండ ప్రాజెక్ట్ తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఘనంగా ప్రారంభించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Veligonda Project | మార్కాపురం జిల్లా గంటవానిపల్లిలో వెలిగొండ ప్రాజెక్ట్ తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఘనంగా ప్రారంభించారు. కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చి, పైలాన్‌ను ఆవిష్కరించడంతో పాటు నల్లమల్ల సాగర్‌కు నీటిని విడుదల చేశారు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం (1996 మార్చి 5న) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు చేతుల మీదుగానే తొలి దశ ప్రారంభం కావడం విశేషం.

Veligonda Project | ప్రాజెక్టు లక్ష్యాలు, ప్రయోజనాలు..

శ్రీశైలం జలాశయం నుంచి 43.53 టీఎంసీల కృష్ణా వరద జలాలను నల్లమల కొండల గుండా మళ్లించి, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. తొలి దశ ప్రారంభం ద్వారా 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు విడుదల చేస్తున్నారు. దీని ద్వారా సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందనుంది. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 4,47,300 ఎకరాలకు (మార్కాపురం జిల్లాలో 3,08,700 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 27,400 ఎకరాలు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 27,200 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 84,000 ఎకరాలు) సాగునీరు అందనుంది.

 

 

ఇది కూడా చదవండి: Modi Bishkek Visit | బిష్కెక్​లో ప్రధాని మోదీ పర్యటన

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *