Tirumala Brahmotsavam | మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి

తిరుమల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Tirumala Brahmotsavam | తిరుమల (Tirumala) బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు భక్తులకు దర్శనం ఇచ్చారు.

మలయప్ప స్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై భక్తులకు అభయమిచ్చారు. గజరాజులు ముందుగా నడుస్తుండగా స్వామివారు మాఢవీధుల్లో విహరించారు.

Tirumala Brahmotsavam | ఆకట్టుకున్న కళాకారులు

మోహినీ అవతార సేవలో 502 మంది కళాకారులు చేసిన జానపద, శాస్త్రీయ ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. గ్యాలరీ ఏర్పాట్లను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి..: Chilakaluripet Fire Accident | క్రాకర్స్​ షాపులో మంటలు.. యజమాని మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *