అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Retired Police Employees | పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు ఎళ్లవేళలా అండగా ఉంటామని సీపీ సాయిచైతన్య(cp saichaitanya) పేర్కొన్నారు. నగరంలోని సీపీ కార్యాలయంలో శుక్రవారం పోలీస్శాఖలో (nizamabad police) పదవీవిరమణ పొందిన పలువురు అధికారులను ఘనంగా సన్మానించారు.
Retired Police Employees | రిమార్క్ లేకుండా ..
సీపీ మాట్లాడుతూ.. పోలీస్శాఖలో(telangana police) పని ఒత్తిడి సహజంగా ఉంటుందన్నారు. దీంట్లోనూ రిమార్క్ లేకుండా పలువురు సిబ్బంది రిటైర్ కావడం అభినందనీయమన్నారు. శాఖకు వారు చేసిన సేవలు అమోఘమని.. రిటైర్మెంట్ అనంతరం కూడా పోలీస్శాఖ అండగా ఉంటుందని పేర్కొన్నారు. స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు సంతోష్రెడ్డి, సాయన్రావు, ఆర్ఎస్సై జలగం చంద్రశేఖర్ రావు, ఏఆర్ఎస్సై తజ్ముల్ అహ్మద్, ఏఆర్ కానిస్టేబుల్ ఏ. శంకర్ పదవీవిరమణ పొందిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్ శుభం ప్రకాష్, అదనపు డీసీపీ (ఏఆర్) రామ్ చందర్రావు, హోంగార్డ్స్ ఏసీపీ కె దీపక్ చంద్ర, ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్, ఎ జగతి, ఏసీపీ శ్రీశైలం, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్) ధరణి కుమార్, (ఎంటీవో) ఎస్.శేఖర్ బాబు, (వెల్ఫేర్/హోంగార్డ్స్) సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: RTC Workers Issues | ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం : సీఎం రేవంత్రెడ్డి

