అక్షరటుడే, వెబ్డెస్క్ : Inspectors Transfers | సైబరాబాద్ కమిషనరేట్లో పరిధిలో భారీగా సివిల్ పోలీస్ ఇన్స్పెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సైబరాబాద్ సీపీ రమేశ్ రెడ్డి (CP Ramesh Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 65 మందికి స్థాన చలనం కలిగించారు.
Inspectors Transfers | మల్టీజోన్–2కు సరెండర్
తెలంగాణ డీజీపీగా ఇటీవల సీవీ ఆనంద్ (CV Anand) బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒకేసారి 65 మంది ఇన్స్పెక్టర్లను ట్రాన్స్ఫర్ చేయడం గమనార్హం. చాలా కాలంగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీ చేశారు. అంతేగాకుండా పని తీరు ఆధారంగా పలువురిని ఇతర చోట్లకు పంపించారు. పలు పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్వోలను బదిలీ చేశారు. వీఆర్లో ఉన్న పలువురు ఇన్స్పెక్టర్లకు పోస్టింగ్ ఇచ్చారు. కమిషనరేట్ పరిధిలోని 11 మంది ఇన్స్పెక్టర్లను మల్టీజోన్–2కు సరెండర్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పలువురు పోలీసులను త్వరలో బదిలీ చేయనున్నట్లు సమాచారం. పరిపాలన సౌలభ్యం కోసం భారీగా సిబ్బంది ట్రాన్స్ఫర్లు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.
సైబరాబాద్ కమిషనరేట్లో పరిధిలో సివిల్ పోలీస్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. pic.twitter.com/Vp5FmnKMa4
— TG Govt Updates (@TGGovtUpdates) May 3, 2026
దీనిని కూడా చదవండి : Telangana PRC | పీఆర్సీపై త్వరలో నిర్ణయం : సీఎం రేవంత్రెడ్డి

