అక్షరటుడే, వెబ్డెస్క్: Kamal Haasan | తమిళనాడు రాజకీయ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా ‘హంగ్’ ఫలితాలు రావడంపై మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 108 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) ను ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరకపోవడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన విమర్శించారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిన బాధ్యత గవర్నర్పై ఉందని ఆయన స్పష్టం చేశారు.
Kamal Haasan | రాజ్భవన్లో కాదు.. శాసనసభలో తేలాలి..
అసెంబ్లీలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీని విస్మరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడమేనని కమల్ పేర్కొన్నారు. ఎవరికి బలం ఉందనేది శాసనసభ వేదికగా బలాబలాల పరీక్ష ద్వారా తేలాలే తప్ప, రాజ్భవన్లో నిర్ణయాలు తీసుకోకూడదని ఆయన హితవు పలికారు. ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వనప్పుడు, అతిపెద్ద పార్టీకి అవకాశం ఇవ్వడమే సరైన రాజ్యాంగ పద్ధతి అని ఆయన గుర్తు చేశారు.
Kamal Haasan | స్టాలిన్ పరిపక్వతపై ప్రశంసలు..
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ వ్యవహరిస్తున్న తీరును కమల్ హాసన్ కొనియాడారు. ప్రజల తీర్పును అంగీకరిస్తూ, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పనిచేస్తామని స్టాలిన్ ప్రకటించడం ఆయన రాజకీయ పరిపక్వతకు నిదర్శనమని ప్రశంసించారు. అయితే, గెలిచిన 233 మంది ఎమ్మెల్యేలు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకపోవడంపై కమల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Kamal Haasan | రాష్ట్రానికి ఇది అవమానకరం..
ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంలో జరుగుతున్న జాప్యం తమిళనాడుకు అవమానకరమని కమల్ ఆవేదన వ్యక్తం చేశారు. “నేను మాట్లాడుతున్నది రాజకీయాల గురించి కాదు.. ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా రాజ్యాంగ గౌరవం కోసం మాట్లాడుతున్నాను” అని ఆయన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును వెంటనే అమలులోకి తీసుకువచ్చి, ప్రజాస్వామ్య పనితీరును గాడిలో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: CPI Letter Governor | సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఆహ్వానించాల్సిందే.. గవర్నర్కు సీపీఐ బహిరంగ లేఖ

