అక్షరటుడే, కామారెడ్డి: RTC Bus Accident | ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటన దేవునిపల్లి (Devunipalli) సర్కిల్లోని పొందుర్తి శివారులో జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది.
RTC Bus Accident | పొందుర్తి శివారులో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొందుర్తి శివారులో రోడ్డు పక్కన ఓ లారీ పార్క్ చేసి ఉంది. అయితే హైదరాబాద్ నుంచి బోధన్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు పొందుర్తి శివారులో జాతీయ రహదారిపై ఈ ఆగిఉన్న లారీని ఢీకొంది. దాంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో బస్సులో ముందు భాగంలో కూర్చున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. ఘటనాస్థలాన్ని కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్, ఎస్సై రంజిత్ కుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం
కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. భిక్కనూరు మండలం పొందుర్తి శివారులో 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. కాగా.. ఈ బస్సులు బోధన్ నుంచి… pic.twitter.com/L4cBfg0HuU
— Akshara Today | Telugu News (@aksharatoday) May 7, 2026
ఇది కూడా చదవండి..: Double Engine Sarkar | తెలంగాణాలోనూ త్వరలో ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ : దినేష్ కులాచారి

