అక్షరటుడే, వెబ్డెస్క్: Bird Flu in Maharashtra | మహారాష్ట్రలో బర్డ్ఫ్లూ వ్యాప్తిస్తోంది. వ్యాధి పడిన కోళ్లు చనిపోతున్నాయి. మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా (Nandurbar District) నవాపూర్ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందిందని అక్కడి అధికారులు తెలిపారు. బర్డ్ ఫ్లూను అదుపు చేసేందుకు రెండు రోజుల్లో 44 వేలకు పైగా కోళ్లను చంపి పూడ్చేశారు. అంతేకాకుండా 39 వేల గుడ్లు, 58 వేల కేజీల దాణాను పారబోశారు.
Bird Flu in Maharashtra | ప్రజల్లో ఆందోళన
మహారాష్ట్ర (Maharashtra)లో బర్డ్ఫ్లూ విస్తరిస్తుండడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వేల సంఖ్యలో కోళ్లకు వ్యాధి సోకుతోంది. దీంతో అధికారులు వ్యాప్తిని కట్టి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వ్యాధి సోకిన కోళ్లను పూడ్చి పెడుతున్నారు. అలాగే వేల సంఖ్యలో గుడ్లను కూడా పడేస్తున్నారు.
Bird Flu in Maharashtra | కఠిన ఆంక్షలు అమలు
బడ్ఫ్లూను గుర్తించిన ప్రాంతంలో కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. అంతేకాకుండా నష్టపోయిన రైతులకు పరిహారం అందజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాంతంలోని కోళ్ల ఫారాల యజమానులు కోళ్లను విక్రయించకూడదని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ప్రాంతానికి శివారులోని గుజరాత్లోనూ వ్యాధి వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. కోళ్ల వ్యాపారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Bird Flu in Maharashtra | వ్యాపారంపై ప్రభావం
బడ్ఫ్లూ వ్యాపిస్తుండడంతో వ్యాపారాలపై ప్రభావం చూపిస్తోంది. చికెన్ షాపులు, హోటళ్లలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దీంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి, వేల కోళ్లను పూడ్చి పెట్టిన అధికారులు.. #birdflu pic.twitter.com/XIQlC6CcCc
— BBC News Telugu (@bbcnewstelugu) May 8, 2026
ఇది కూడా చదవండి..: Vijay Thalapathy Prediction | విజయ్ దళపతిపై వేణుస్వామి సంచలన జోస్యం.. త్రిష లేకపోతే రిజల్ట్ వేరేలా..

