అక్షరటుడే, వెబ్డెస్క్: Bhagirath Sai POCSO case | కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ సాయిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద మహిళలు ఆందోళన చేపట్టారు. దీంతో స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వందలాది మంది మహిళలు పోలీస్ స్టేషన్ వెలుపల భారీ నిరసన చేపట్టారు.
Bhagirath Sai POCSO case | కేసు నేపథ్యం..
మొయినాబాద్లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఒక మైనర్ బాలికతో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై భగీరథ్ సాయిపై పోలీసులు ఇదివరకే కేసు నమోదు చేశారు. బాధితురాలు , ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పేట్బషీరాబాద్ పోలీసులు శుక్రవారం ఆయనపై పోక్సో (POCSO) చట్టంలోని పలు కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Bhagirath Sai POCSO case | నిరసనకారుల డిమాండ్..
నిందితుడిపై కేసు నమోదై రెండు రోజులు గడుస్తున్నా ఇంకా అరెస్ట్ చేయకపోవడంపై మహిళా సంఘాలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కుమారుడు కావడం వల్లే అరెస్టులో జాప్యం జరుగుతోందని నిరసనకారులు పోలీసులను ప్రశ్నించారు. ఈ నిరసన నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపబోమని నిరసన తెలిపిన మహిళలు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Vijay Welfare Schemes| ముఖ్యమంత్రిగా విజయ్ తొలి అడుగు.. ఉచిత విద్యుత్, ఫ్రీ బస్ ప్రయాణంపై తొలి సంతకాలు

