అక్షరటుడే, వెబ్డెస్క్: Constable Murder Kakinada | ఆంధ్రప్రదేశ్ AP లోని కాకినాడ నగరంలో అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. గాంధీనగర్ ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న పోలీస్ కానిస్టేబుల్ను గుర్తుతెలియని దుండగులు అత్యంత పాశవికంగా గొంతు కోసి హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Constable Murder Kakinada | పదునైన కత్తితో
పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పెషల్ పోలీస్ (APSP) విభాగానికి చెందిన నాగేశ్వరరావు గాంధీనగర్ వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా.. మాటు వేసిన దుండగులు ఒక్కసారిగా దాడికి దిగారు. పదునైన కత్తితో ఆయన గొంతు కోసి పారిపోయారు. తీవ్ర రక్తస్రావం కావడంతో నాగేశ్వరరావు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
సమాచారం అందుకున్న జిల్లా పోలీసు ఉన్నతాధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సర్కారు దవాఖానా Hospital కు తరలించారు.
Constable Murder Kakinada | అన్ని కోణాల్లో దర్యాప్తు:
పోలీసులు Police దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ హత్య వెనుక ఏవైనా పాత కక్షలు ఉన్నాయా? అనే కోణంలో విచారిస్తున్నారు. విధుల నిర్వహణలో భాగంగా ఎవరితోనైనా గొడవలు జరిగాయా అన్నది ఆరా తీస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
Bharat Karth Accident | సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో నటుడు, కెమెరామన్ దుర్మరణం

