అక్షరటుడే, వెబ్డెస్క్: Google AI Data Center | ప్రముఖ ఐటీ సంస్థ గూగుల్ ఏపీలోని విశాఖ పట్నం (Visakhapatnam)లో ఏర్పాటు చేయనున్న అతిపెద్ద మెగా డేటా సెంటర్, ఏఐ హబ్కు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Union Minister Ashwini Vaishnaw)తో కలిసి సీఎం చంద్రబాబు (CM Chandrababu) మంగళవారం శంకుస్థాపన చేశారు. విశాఖ జిల్లా తర్లువాడలో భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.
విశాఖను డేటా సెంటర్ హబ్గా మారుస్తామని గతంలో సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గూగుల్ డేటా సెంటర్ (Google Data Center) కోసం విశాఖలోని 3 ప్రాంతాల్లో భూమి కేటాయించారు. సుమారు రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ నిర్మాణానికి గూగుల్ ముందుకు వచ్చింది. విశాఖ, అనకాపల్లి జిల్లాల పరిధిలో గిగావాట్కు పైగా సామర్థ్యంతో మూడు చోట్ల డేటాసెంటర్లు నిర్మించనుంది.
Google AI Data Center | 600 ఎకరాల్లో..
తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం 600 ఎకరాల భూమి కేటాయించింది. దీని కోసం 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, మంత్రి లోకేష్, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Vizianagaram Road Accident : పాదచారులపైకి దూసుకెళ్లి..లారీని ఢీకొట్టి.. విజయనగరంలో కారు బీభత్సం.. నలుగురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్ర గాయాలు


[…] ఇది కూడా చదవండి..: Google AI Data Center | గూగుల్ ఏఐ డేటా సెంటర్కు శం… […]