అక్షరటుడే, వెబ్డెస్క్: YS Jagan Speech | ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందని తెలిపారు.
తమ పాలనలో 99 శాతం హామీలు అమలు చేశామని జగన్ చెప్పారు. సంక్షేమ క్యాలెండర్ అమలు చేశామన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. 3 లక్షల మంది గిరిజనులకు పట్టాలు ఇచ్చామన్నారు.
YS Jagan Speech | త్వరలో ముగింపు

చంద్రబాబు (CM Chandrababu) హయాంలో విధ్వంసకర పాలన నడుస్తోందని జగన్ విమర్శించారు. దుర్మార్గమైన పాలనకు త్వరలోనే ముగింపు ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించేవారిపై దొంగ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రెడ్బుక్ రాజ్యాంగం వెర్రితలలు వేస్తోందన్నారు. ప్రజల తరఫున పార్టీ నాయకులు గట్టిగా నిలబడాలని సూచించారు. బాధితులకు అండగా నిలవాలన్నారు.
ఇది కూడా చదవండి..: Jana Sena Joinings Committee | జనసేన పార్టీలో చేరికల సమన్వయానికి కమిటీ ఏర్పాటు